తెలంగాణ లో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. సోమవారం లోపు వేతనాలు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. కార్మికులతో సర్కారు చర్చలు జరపాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గి, సమ్మె విరమించాలని సూచించింది. కాగా, చర్చల కోసం ప్రభుత్వం నుంచి పిలుపురాకపోవడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే: జేసీ