కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగాలేదని వస్తున్న పుకార్లను తాము ఖండిస్తున్నామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇప్పటికే ప్రకటన చేశారు. తాజాగా ఈ పుకార్లపై అమిత్ షా కూడా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఎలాంటి జబ్బుతో బాధపడడంలేదని తెలిపారు.
కేంద్ర మంత్రిగా తన విధులను సంపూర్ణ అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. దేశం కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న వేళ తాను విధి నిర్వహణలో తలమునకలుగా ఉన్నానని, ఇలాంటి రూమర్లను పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. రూమర్ల విషయం తనకు తెలిసినా, సదరు వ్యక్తుల వికృత మనస్తత్వానికే ఆ విషయం వదిలేశానని అన్నారు.