ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. సీఎస్ బదిలీ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు. మీ పుణ్యమా అని ఐఏఎస్ అధికారుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని సీఎం జగన్ పై విమర్శలు చేశారు.
“సీఎం గారూ మీ పరిపాలన అగమ్యగోచరంగా ఉంది. ఓ విషయంలో తన కిందిస్థాయి అధికారికి సీఎస్ షోకాజ్ నోటీసులు ఇస్తే ఆ కింది స్థాయి అధికారిని మీరు రక్షిస్తూ సీఎస్ నే బదిలీ చేశారు. పాలనా యంత్రాంగానికి మీరు ఇస్తున్న సందేశం ఏమిటి? అని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, ఏమి అవగాహవన అని ఎద్దేవా చేశారు.
రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తా: పవన్ కల్యాణ్