telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసుల విచారణకు జగన్‌ ఎందుకు సహకరించట్లేదు: బుచ్చయ్య చౌదరి

gorantla buchaiah chowdary

టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… అక్రమాస్తుల కేసులో సీఎం జగన్‌కు శిక్ష పడడం ఖాయమని అన్నారు.కే సుల విచారణకు జగన్‌ ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు.

పదవులతో సంబంధం లేకుండా విచారణకు సహకరించాలి కదా? అని అన్నారు.సీబీఐ అధికారులను మార్చాలని అడగడం ఎంతటి దౌర్భాగ్యం అని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసుపై ఎన్నిసార్లు మాట మారుస్తారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి లెక్కలు చూపించారా? అని నిలదీశారు.

Related posts