telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

గేట్‌ వద్ద బైఠాయించిన జేఎన్‌టీయూ విద్యార్థులు

jntu main gate

తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజయనగరం జేఎన్‌టీయూ విద్యార్థులు రోద్దేక్కరు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన గేట్‌ ఎదుట బైఠాయించారు. కళాశాల నిర్వహణంలో ప్రిన్సిపాల్‌ విఫలమయ్యారని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా విద్యార్థులకు అందించలేకపోతున్నారని విద్యార్థులు ధ్వజమెత్తారు.

బోధన, పరిశోధనశాలల నిర్వహణ సామగ్రి కోసం గత ఏడాది విడుదల చేసిన రూ.కోట్ల నిధులు ఇప్పటికీ వినియోగించడం లేదని దాని వల్ల నాణ్యమైన విద్యను అందుకోలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అవసరం పడే స్టేషనరీ దుకాణం గత కొద్ది నెలలుగా లేదని, ఏ అవసరం వచ్చినా ఆరు కిలోమీటర్ల దూరంలోని పట్టణంలోకి వెళ్లాల్సి వస్తుందని విలపించారు.

Related posts