అమ్మవార్ల దయతో టీడీపీ గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అదృష్టవంతుడని జెసి వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణమని వివరించారు. . నిన్న క్యూలో అమ్మవార్లు, వృద్ధులు విరగబడి వచ్చారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికే వాళ్లు వచ్చారు. అనంతపురం లోక్సభలో అందరినీ మార్చమని నేను చెప్పానని వివరించారు. మార్చకపోతే గెలవం అని చెప్పాను. అయినా మార్చలేదు. మార్చకపోయినా గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయేనని జెసి చెప్పారు.
అనంతపురం టౌన్, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం. రాసిపెట్టుకోండి.. మే 23వ తేదీన చూడండి అంటూ దివాకర్రెడ్డి జోస్యం చెప్పారు. బాబుకు అదృష్టం.. సుడి తిరిగినట్లు తిరిగిందని జేసీ కొనియాడారు. ఈవీఎంలు మధ్యాహ్నానికే పనిచేశాయని, సహజంగా క్యూలో ఉండే మహిళలు ఒక్కసారి ఇంటికి వెళ్తే తిరిగిరారు.. కానీ చంద్రబాబు పిలుపుతో ఆయనకు కృతజ్ఞతతోనే మళ్లీ వచ్చి ఓటేశారని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సైలెంట్ వేవ్ మహిళల్లో ఉందని, అందుకే అర్థరాత్రి దాకా ఓట్లు వేశారని జేసీ పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరపురాని సన్నివేశమని చెప్పారు.
కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి