దేశవ్యాప్త లాక్డౌన్ను వచ్చే నెల 3 వరకు పొడిగించిన నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి మే 3 మధ్య బుక్ అయిన 39 లక్షలకుపైగా టికెట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 21 రోజులపాటు లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను కేంద్రం మరికొన్ని రోజులు పొడిగించింది. రైల్వే కూడా రైలు సర్వీసులను అప్పటి వరకు రద్దు చేసింది.
బుక్ అయిన 39 లక్షల టికెట్లను రద్దు చేయడంతో పాటు మే 3 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు, అడ్వాన్స్ బుకింగులను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పూర్తి డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది. కౌంటర్లలో బుక్ చేసుకున్న వారు మాత్రం అక్కడే డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది.