లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ.. యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేయనున్నారు. ఈనెల 11వ తేదీన ఆమె రాయ్బరేలీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
రాహుల్ ఈనెల 10వ తేదీన అమేథీలో నామినేషన్ వేస్తారు. సోనియా, రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా హాజరుకానున్నారు. రాహుల్ గురువారం కేరళలోని వయనాడ్లోనూ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.