కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో మధ్యప్రాచ్య దేశాల్లో చిక్కుకున్న భారతీయ కార్మికులు తిరిగి మన దేశానికి వచ్చేందుకు విమానాలను నడపాలని కాంగ్రెస్పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో మధ్యప్రాచ్యంలో వ్యాపారాలు మూతపడ్డాయని, దీంతో వేలాదిమంది కార్మికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎందుర్కొంటున్నారని చెప్పారు. కార్మికులు స్వదేశానికి తిరిగి రావాడానికి మార్గంలేకపోవడంతో ఆందోళనకు గురవుతన్నారని ట్వీట్ చేశారు.
మనీష్ ను పక్కన పెట్టడం పై వార్నర్ సంచలన వ్యాఖ్యలు…