telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి నిరంజన్ రెడ్డి

niranjanreddy minister

రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో కార్యాలయం, దుకాణాల సముదాయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

రసాయన ఎరువులు తగ్గించి సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేయాలని సూచించారు. రైతులు పండించిన పంట మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts