telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పర్యాటక ప్రాంతాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్: మంత్రి అవంతి

కోటి రూపాయలతో శిల్పారామాలకు మరమ్మతులు చేపడుతున్నామని ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇడుపులపాయలోనూ శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్టు అవంతి వివరించారు. టూరిజం, యువజన సర్వీసులపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ తీసుకువస్తామని వెల్లడించారు.

పదిహేను పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని, కొండపల్లి పోర్టు, గాంధీ మ్యూజియం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జగన్ ఆదేశించారని అన్నారు. నదిలో బోటు రవాణాపై త్వరలో ఓ కమిటీ వేసి నివేదిక అందజేస్తామని, అలాగే, నదిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాకు ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతిలో స్టేడియాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించిందని తెలిపారు.

Related posts