telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది : మంత్రి పిల్లి సుభాష్‌

pilli subhash chandra bose ycp

కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. కాకినాడ కలెక్టరేట్‌లో తొలిసారి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ నేపథ్యంలో రైతు రుణాల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ కౌలు రైతులకు సహాయం చేయకపోతే భగవంతుడు క్షమించడన్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ కౌలు రైతుల కోసం రెవెన్యూ శాఖ నూతన ప్రభుత్వంలో ఒక డాక్యుమెంట్‌ తయారు చేసి, రైతుల పక్షాన నిలుస్తామన్నారు. కార్పోరేషన్‌ లోన్లు మంజూరు అయిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, రాపాక వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు.

Related posts