ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిన్న ఆత్మాహుతికి యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను హైదరాబాదులోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
అయితే వైద్యానికి ఆయన శరీరం సహకరించలేదు. ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. ఆయన శరీరం 90 శాతం కాలిపోయిందని తెలిపారు. మరోవైపు, శ్రీనివాసరావు మృతి చెందారన్న వార్తతో ఆర్టీసీ ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. కన్నీటిపర్యంతం అవుతున్నారు. శ్రీనివాసరావు మృతి నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నాయి.
తనను గద్దె దింపేందుకు బీజేపీ ఎన్నో కుట్రలు: కుమారస్వామి