telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

70 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం: అశ్వత్థామ రెడ్డి

ashwathama reddy

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ రూ. 60, 70 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను కలుస్తున్నామని, బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ను కలిసి మద్దతు అడిగినట్లు వెల్లడించారు. ఆర్టీసీ బతికితేనే ప్రజా రవాణా అందరికి అందుబాటులో ఉంటుందని అన్నారు.

ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్‌ ఉద్యోగులు తమకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. శనివారం జరగబోయే మౌన దీక్షలో కార్మిక సంఘాల కుటుంబాలు సైతం పాల్గొంటాయని అన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌, ప్రైవేటు సెక్టార్‌, విద్యుత్‌ సెక్టార్‌ల నుంచి మద్దతు కూడగడతామని, అన్ని ప్రభుత్వ సంఘాలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Related posts