telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న కేకేఆర్…

ఐపీఎల్ 2020 లో ఈ రోజు షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికే ఐపీఎల్ 2020 లో ప్లే ఆఫ్ రేస్ మొదలు కావడంతో ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న కేకేఆర్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే 5వ స్థానానికి పడిపోతుంది. దాంతో ఆ స్థానంలో ఉన్న పంజాబ్ 4వ స్థానానికి వెళ్తుంది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుండి దాదాపు మూడు జట్లు తప్పుకోగా మిగిలిన 5 జట్లు టాప్ 4 లో స్థానం కోసం పోటీపడుతున్నాయి. అందులో పంజాబ్, కోల్‌కత కూడా  ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరి విజయం సాధిస్తారు అనేది చూడాలి.

పంజాబ్ : కెఎల్ రాహుల్ (w/c), మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

కోల్‌కత : శుబ్మాన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (w), ఇయాన్ మోర్గాన్(c), సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Related posts