telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్బీఐని కొల్లగొట్టినంత మాత్రాన.. ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో పెట్టలేరు: రాహుల్

rahul gandhi to ap on 31st

దేశ ఆర్థిక సంక్షోభం పై రిజర్వ్ బ్యాంకు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్లను బదిలీ చేస్తామంటూ ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నుంచి డబ్బులు దొంగిలించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉందని చెప్పారు.

రిజర్వ్ బ్యాంకును కొల్లగొట్టినంత మాత్రాన ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో పెట్టలేరని విమర్శించారు. ఆర్థిక సంక్షోభానికి కారణమైన ప్రధాని, ఆర్థిక మంత్రిలకు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య… తుపాకీ గాయానికి బ్యాండ్ ఎయిడ్ వేయడం వంటిదని ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు.

Related posts