ఘనాలోని అక్రాకు చెందిన అకొసుహ మే అనే యువతి గత కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. ఈ క్రమంలో అకొసుహకు తన ప్రియుడి నిజాయితీని టెస్ట్ చేయాలనిపించింది. వెంటనే ఓ ఫేక్ ట్విటర్ ఖాతాను తెరిచి అపరిచిత యువతిగా ప్రియుడితో చాట్ చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో వారి మధ్య లవ్ గురించి చర్చ వచ్చింది. యువకుడితో అకొసుహ నీకు గర్ల్ఫ్రెండ్ ఉందా అని అడిగింది. దాంతో యువకుడు తనకు లవర్ ఉండేదని చెప్పాడు. కాని, రెండు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయిందన్నాడు. అది విన్న అకొసుహ ఖంగుతింది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ పోస్టుకు 30వేల రిట్వీట్స్, లక్షకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి.
next post
న్యాయం అనేది ప్రతీకారంగా మారకూడదు: సుప్రీంకోర్టు సీజే బాబ్డే