భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ ఇద్దరూ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లతో జట్టుకు విజయాలను అందించారు. అలాగే చాలా మ్యాచ్ల్లో వీరిద్దరూ కలిసి సుదీర్ఘ భాగస్వామ్యాలు నెలకొల్పి టీమ్ను విజయతీరాలకు చేర్చారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించి భారత పేసర్ మహ్మద్ షమీకి చిక్కుప్రశ్న ఎదురైంది. రోహిత్, కోహ్లీ ఇరువురు పరస్పరం వేర్వేరు జట్ల తరపున ఆడితే, ఎవరికి మద్దతు ఇస్తావని షమీని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా రోహిత్కే తన ఓటు అని షమీ పేర్కొన్నాడు. కోహ్లీ ఆటతీరు గురించి తాను తక్కువ చేసి మాట్లాడటం లేదని, మూడు ఫార్మాట్లలో విరాట్ అనేక రికార్డులు నమోదు చేశాడని గుర్తు చేశాడు. అయితే రోహిత్ బ్యాటింగ్లో పొందిక ఉంటుందని కొనియాడాడు. బౌలర్ను ఎదుర్కొనేందుకు తన వద్ద చాలా సమయం ఉంటుందని పేర్కొన్నాడు. బౌలర్కు ఏమాత్రం అనుమానం రాకుండానే అతనిపై విరుచుకుపడే స్వభావం హిట్మ్యాన్ సొంతమని షమీ తెలిపాడు.