telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పుజారా ఆదుకున్నాడు.. విహారి తోడుగా… నాలుగో టెస్టు..

india-austrelia 4th test match 4th day

ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో నాలుగో మ్యాచ్ నాలుగో రోజు ఆట ఆరంభంలో తడబడినా కూడా నిలదొక్కుకొని ఆడటంతో మన టీం పై చేయి సాధించింది. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు సాధించి, భారీ స్కోరు దిశగా సాగింది. రహానే 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయిన తరువాత, హనుమ విహారితో కలిసిన సెంచరీ హీరో ఛటేశ్వర్ పుజారా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.

ఆసీస్ నుండి ఎవరు బౌలింగ్ కు వచ్చినా నిదానంగా ఆడుతూ, అప్పుడప్పుడూ బంతిని బౌండరీ దాటిస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆసీస్ కెప్టెన్ బౌలర్లను మార్చినా మరో వికెట్ ను తీయలేకపోయాడు. ప్రస్తుతం పుజారా 130 పరుగులతో (16 ఫోర్లు), హనుమ విహారి 39 పరుగులతో (5 ఫోర్లు) ఉన్నారు. రేపు భారత స్కోరును 400 పరుగులు దాటిన తరువాత భారత్ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి, ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించే అవకాశం ఉంది. తొలి రోజు ఆటలో స్టార్క్, హాజిల్ వుడ్, కుమిన్స్, లియాన్, లాబుస్ చేంజ్ లు బౌలింగ్ చేయగా, హాజిల్ వుడ్ కు రెండు వికెట్లు దక్కాయి.

Related posts