సినిమాల్లో కమెడియన్గా రాణిస్తూనే నిర్మాతగా కూడా ప్రయోగాలు చేసిన బండ్ల గణేష్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్లేడు ఇష్యూతో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో తిరిగి కెమెరా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు అంశాలపై రెగ్యులర్గా స్పందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్పై ప్రశంసలు గుప్పిస్తూ ఆయన గురించిన కామెంట్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా తాను నిర్మించిన సూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై నేడు (మే 11)తో 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు బండ్ల గణేష్. ఈ ట్వీట్స్ ద్వారా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత అభిమానం, పిచ్చి అనే విషయాన్ని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు బండ్ల గణేష్.
అబ్బా అ ఏం జీవితం ఆహా బ్రహ్మాండమయిన కిక్ వచ్చింది గబ్బర్ సింగ్ మజాకానా థాంక్యూ బ్రదర్స్ #8YrsOfGabbarSinghHysteria https://t.co/6vKJWF1lYZ
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
ఇక ఆ వెంటనే తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఓపెన్ అవుతూ పలు పోస్టులు పెట్టిన బండ్ల గణేష్.. ‘రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు’ అని పేర్కొన్నారు.
జీవితంలో కిక్ కావాలంటే ఒక్క సినిమా నే నేను డిసైడ్ అయ్య నాకు సినిమానే జీవితం సినిమాయే ప్రాణ౦ నా 15 సం||రాల వయస్స లో సినిమా ఇండస్ట్రీకి వచ్చ నాకు రాజకీయాలు వద్దు సినిమాయే ముద్దు నావల్ల నా మాటలు వల్ల భాదపడ్డ ప్రతి ఒక్కరికి క్షముంచమని కొరుకుటున్నాను #8YrsOfGabbarSinghHysteria
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
సినిమా తీయాలి బ్లాక్ బస్టర్ కొట్టాలి సినిమాపై సినిమా తీయాలి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ కొట్టాలి ఇది తప్ప ఇంకోటి ఆలోచించను #8YrsOfGabbarSinghHysteria
— BANDLA GANESH (@ganeshbandla) May 11, 2020
ఇక బండ్ల గణేష్ విషయానికొస్తే… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారారు . ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా అవతారమెత్తారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘తీన్మార్’ అనే సినిమా నిర్మించి నష్టపోయిన గణేష్, గబ్బర్ సింగ్ సినిమాతో కాసుల పండగ చేసుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలతో ఎన్టీఆర్ హీరోగా ‘బాద్షా’ ‘టెంపర్’ సినిమాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అనంతరం మళ్లీ ఆషీకీ-2 తెలుగులో ‘నీ జతగా నేనుండాలి ‘ పేరుతో రీమేక్ చేసి ప్లాప్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన గణేష్..అక్కడ కూడా ఫ్లాప్ అవ్వడంతో తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు.
“ఆపమ్మా కొంచెం… నీకు బోర్ కొట్టట్లా…” ఫోటోగ్రాఫర్పై మహేష్ పంచ్