telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

చీప్ లిక్కర్‌ను పరీక్షలకు పంపాలి… ఏపీలో మద్యం విక్రయాలపై పిటిషన్

HC

కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తి చెందుతున్న ప్రస్తున్న తరుణంలో మద్యం విక్రయాలు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది. కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దుకాణాలకు అనుమతివ్వడం సరైన చర్య కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. మద్యం షాపుల వద్ద వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. అలాగే మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న వివిధ రకాల చీప్ లిక్కర్‌ను పరీక్షలకు పంపాలని కోరారు. మద్యం విక్రయాలు చేయడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయస్థానానికి ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేస్తామని చెబుతోందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాబట్టి మద్య నిషేధం అమలు చేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న వివిధ రకాల చీప్ లిక్కర్‌ను పరీక్షలకు పంపాలని పిటిషినర్ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దశల వారీగా దాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిందన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం బుధవారంలోపు కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే గురువారం పిటిషనర్ తరఫు న్యాయవాది రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Related posts