telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఊర్వశి రౌతెల ప్రధాన పాత్రలో ‘బ్లాక్ రోజ్’

Black-Rose

బాలీవుడ్ హాట్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతెల ప్రధాన పాత్రలో ‘బ్లాక్ రోజ్’ అనే సినిమా రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్నారు. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ.. ‘‘మేం నిర్మిస్తున్న ‘బ్లాక్ రోజ్’ చిత్ర యూనిట్‌కి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆగస్ట్ 17 నుండి నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నాం. రెండు సార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి, బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అందాల భామ ఊర్వశి రౌతెల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా ‘బ్లాక్ రోజ్’ కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి ఈ చిత్రం చేయడానికి అంగీకరించారు. కొవిడ్ టైమ్‌లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాం’’ అని అన్నారు.

ఈ చిత్రాన్ని క్రియేట్ చేస్తున్న సంపత్ నంది మాట్లాడుతూ.. ‘‘షేక్స్‌పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ‘విచక్షణలేని, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్‌ను జోడిస్తూ ‘బ్లాక్ రోజ్’ను నిర్మిస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Related posts