దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ ఆగింది. పూణేలో కొత్త షెడ్యూల్ను ప్లాన్ చేయగా… కరోనా కారణంగా ఆ షెడ్యూల్ కాస్తా వాయిదా పడింది. రెండు నెలలు దాటినా కరోనా ఎఫెక్ట్ తగ్గకపోవడంతో పాటు.. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ దాటే పరిస్థితి లేకపోవడంతో జక్కన్న తెలంగాణలోనే లొకేషన్స్ను వెతికే పనిలో బిజీగా ఉన్నారట. అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, రామ్చరణ్ కాంబినేషన్ సీన్స్ను కోటలో చిత్రీకరించాల్సి ఉందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెట్స్ వేయడం కంటే రియల్ లొకేషన్స్ బెటర్ అని భావించి జక్కన్న నల్గొండలో కోటలను పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
previous post