telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భయంకరంగా “మిస్కిన్‌ సైకో”

నిత్యామీనన్‌, అదితిరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్‌,, ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సినిమా “మిస్కిన్‌ సైకో”. డీఎస్‌ సినిమాస్‌ బ్యానర్‌పై డి. శ్రీనివాస్‌ రెడ్డి ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. “పిశాచి”, “డిటెక్టివ్‌” లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మిస్కిన్‌ నుంచి వస్తున్న మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. మ్యాస్ట్రో ఇళయరాజా దీనికి సంగీతం అందిస్తున్నారు. అయితే… సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డి. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. వైవిధ్యమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని పేర్కొన్నారు. కొత్త దనాన్ని కోరుకునే తెలుగు సినీ ప్రేక్షకుల కోసం “మిస్కిన్‌ సైకో” సినిమాని తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా అతి త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా…విశాల్‌ హీరోగా మిస్కిన్‌ దర్శకత్వంలో వచ్చిన “డిటెక్టివ్‌” సినిమా ఎంత పెద్ద హిట్‌ సాధించిందో తెలిసిందే..

Related posts