వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పులివెందుల పంచాయతీతో రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయొద్దని అన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ నేతలు ప్రజలు ఛీకొట్టేలా చేసుకోవద్దని సూచించారు.
వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏ సెక్షన్ కింద కేసులు పెడుతున్నారో చెప్పాలని, లేకుంటే పోలీసుల్ని దోషులుగా నిలబెడతామన్నారు. టీడీపీ సామాజిక కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్పారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు సూచించారు.