సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేయడంపై చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్లో ఓ ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక వసూళ్ళ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో దసరా సెలవులు కారణంగా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురుస్తుంది. ‘సైరా’తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.85 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం 1 మిలియన్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు విశ్లేషకులు తెలిపారు. రానున్న రోజులలో ఈ చిత్రం మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయం అని చెబుతున్నారు.
next post
పరుచూరి గోపాలకృష్ణ భార్యను చంపాలనుకున్నా : పోసాని