లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు ప్రారంభించిన శ్రీచైతన్య పాఠశాలను బుధవారం విద్యాధికారి సీజ్ చేశారు. అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని మండల విద్యాధికారి బాబూ సింగ్కు తెలియజేశారు.
వికారాబాద్ పట్టణంలోని పాఠశాలను ఎంఈవో తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎ్ఫఐ జిల్లా కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాతనే పాఠశాలలు తెరవాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎ్ఫఐ డివిజన్ కార్యదర్శి అక్బర్, నాయకులు సుభాష్ పాల్గొన్నారు.