యధారాజా తధా ప్రజా అన్నట్టు, గురుస్థానంలో ఉండి తప్పుద్రోవలు మనలేకపోతున్న గురువుల వద్ద నేర్చిన విద్యార్థులు మాత్రం సరైన బుద్దితో ఎలా నడుచుకుంటారు.. ఇది అన్ని స్థాయిలలో జరుగుతుందని మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా, నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కేసులు నమోదయ్యాయి. అతగాడిపై పోలీసులు అతడిపై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేశారు.
మియాపూర్ ఇన్స్పెక్టర్ సామల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన ముఖేశ్ మదీనగూడ నారాయణ ఐఐటీ క్యాంపస్లో వైస్ ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ముఖేశ్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విసుగు చెందిన విద్యార్థులు ధర్నా చేసేందుకు ప్రయత్నించగా సమాచారమందుకున్న పోలీసులు కళాశాలకు వెళ్లారు. అప్పటికే ముఖేశ్ తప్పించుకొని వెళ్లిపోయాడు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.