జాతి ప్రయోజనాల కోసమే 370 ఆర్టికల్ ను రద్దు చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ రద్దును ఆయన సమర్థించారు. ఈ నిర్ణయం ఏ ఒక్క పార్టీకి మాత్రమే చెందినది కాదని అన్నారు. కశ్మీర్ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా యావత్ దేశ ప్రజలు వారి వెనుకే ఉంటారని చెప్పారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తగిన చర్యలను చేపట్టాలని అన్నారు.
జాతి ప్రయోజనాలు, భవిష్యత్తు, భద్రత కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశార ని వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకయ్య రచించిన ‘లిజనింగ్… లెర్నింగ్… లీడింగ్’ పుస్తకాన్ని నిన్న చెన్నైలో ఆవిష్కరించారు. ఉప రాష్ట్రపతిగా తన రెండేళ్ల ప్రస్థానాన్ని వెంకయ్యనాయుడు పుస్తక రూపంలో తీసుకువచ్చారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంతి ప్రకాశ్ జవదేకర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు.
రైతు బంధు ఎన్నికల బందుగా మారింది: రేవంత్రెడ్డి