దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. రైతు బంధు ఎన్నికల బందుగా మారిందని విమర్శించారు. రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. లిక్కర్ ధరలు పెంచుతున్న కేసీఆర్.. పంటలకు ధరలు ఎందుకు పెంచడం లేదన్నారు.
కాళేశ్వరం నుంచి ఏటా 530 టీఎంసీలు ఎత్తిపోస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని.. 180 టీఎంసీలకు మించి ఎత్తిపోయలేదన్నారు. ‘మై హోమ్’ రామేశ్వరరావు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ జరగడం వెనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ రామేశ్వర్రావు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడ్డారని దుయ్యబట్టారు.