telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కరోనాను జయించిన తల్లి.. ఇంట్లోకి రానివ్వని కొడుకు!

Corona

కరోనా వైరస్ బారినపడి కోలుకుని ఇంటికి చేరుకున్న తల్లిని ఇంట్లోకి అడుగుపెట్టవద్దంటూ కుమారుడు హుకుం జారీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగింది. బీజేఆర్ నగర్‌కు చెందిన మహిళ (55)కు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆమె నిన్న సాయంత్రం ఇంటికి చేరుకుంది.

కోవిడ్ ను జయించి ఇంటికొచ్చిన తల్లిని చూసిన ఆమె కొడుకు, కోడలు ఆప్యాయంగా పలకరించకపోగా, ఇంట్లోకి అడుగుపెట్టవద్దంటూ హుకుం జారీ చేశారు. ఇంటిపైకప్పు రేకులను ధ్వంసం చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కొడుకు, కోడలు తీరుతో విస్తుపోయిన ఆమె రాత్రంతా ఇంటి ముందే పడిగాపులు పడవలిసివచ్చింది.

Related posts