telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొనసాగుతున్న పవన్‌ కళ్యాణ్‌ పర్యటన.. ఇవాళ ఎక్కడంటే

Pawan

ఏపీలో గత నెలలో సంభవించిన నివర్‌ తుఫాన్‌ ఫలితంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను గత రెండు రోజులుగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. పవన్‌ పర్యటన ఇవాళ, రేపు కూడా కొనసాగనుంది. ఇవాళ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మొదటగా.. శ్రీకాళహస్తి నియోజకవర్గం లో పర్యటించనున్నారు. అక్కడ వరద బాధితులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నెల్లూరుకు వెళ్లనున్నారు. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి రైతులకు వరద వలన కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకోనున్నారు. రేపు రాపూరు, వెంకటగిరిలో పవన్‌ పర్యటించనున్నారు. కాగా…ఈ ఏడాది వర్షాలు వదలడం లేదు. ఇప్పటికే ఏపీ, చెన్నైని వర్షాలు ముంచెత్తాయి. తాజాగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. డిసెంబర్‌ 1 నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవనున్నాయి. 2 న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తుగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 

Related posts