telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కరోనా కేంద్రం నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

New couples attack SR Nagar

జైల్లో కరోనా సోకిన ఖైదీలను చికిత్స అందించేందుకు సమీపంలోని కరోనా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్‌ఆర్ కరోనా కేంద్రం నుంచి ఇద్దరు దొంగలు వైద్య సిబ్బంది నుంచి తప్పించుకొని పరారయ్యారు.

జిల్లా జైల్లో ఉన్న ఇద్దరు దొంగలకు కరోనా సోకడంతో సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కోవిడ్ సెంటర్‌కు తరలించారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున కోవిడ్ సెంటర్ నుంచి పరారయ్యారు. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరారైన దొంగల కోసం గాలిస్తున్నారు.

Related posts