తెలంగాణ పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరో అల్లు అర్జున్ ఓటు వేస్తేనే మనకు ప్రశ్నించే అధికారం ఉంటుందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కు వద్దకు వచ్చి ఆయన ఓటేశారు. అల్లు అర్జున్ వచ్చేసరికే చాలా మంది క్యూ లైన్ లో ఉండటంతో బన్నీ సైతం చాలాసేపు వేచిచూడాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అల్లు అర్జున్ తో పాటు నటుడు పోసాని మురళీకృష్ణ కూడా ఇదే పోలింగ్ బూత్ లో ఒటేశారు. వీరితో సెల్ఫీలు దిగేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు.