telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు విద్యా వార్తలు

లోయలోకి బోల్తా కొట్టిన బస్సు.. 17 మంది దుర్మరణం

Accident

నేపాల్ లోని అర్ఘకాచి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టిన ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు.

నేపాల్ లోని సింధికార్క నుంచి రూపందేహీ జిల్లా కేంద్రానికి నిన్న సాయంత్రం బయలు దేరిన బస్సు మార్గమధ్యంలోఘాట్ రోడ్డులో అదుపుతప్పింది. బస్సును కంట్రోల్ చేయడంలో డ్రైవర్ విఫలం కావడంతో లోయలోకి బోల్తా కొట్టింది. దీంతో బస్సు ప్రయాణికుల్లో చాలా మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిని నేపాల్ పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Related posts