telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదు… రామ రాజ్యం

తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా హల చల్ చేస్తుంది. అయితే ఇక్కడ రాజకీయనాయకులు అందరూ వరుసగా దాని పై స్పందిస్తున్నారు. ఇక తాజాగా దీని పై బీజేపీ ఎంపీ ధర్మ పురి అరవింద్ మాట్లాడుతూ… తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదు… రామ రాజ్యం అని అన్నారు. కాబట్టి షర్మిలా …. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మా సమయం వృథా చేయొద్దు అని అన్నారు. ఆమె పార్టీని హలెలూయా పార్టీగా సంబోధించిన అరవింద్ ఆ పార్టీ ఇక్కడేవ్వరికి అవసరం లేదని అన్నారు.  ఇక తెలంగాణాలో రాజన్నరాజ్యం తేవాలన్నదే తన లక్ష్యమన్నారు వైఎస్‌ షర్మిల. ఆత్మీయ సమావేశాలతో వైఎస్‌ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల.. వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లా అభిమానులతో జరిగిన సమావేశంలో జై తెలంగాణ అంటూ నినదించారు షర్మిల. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లకు చెందిన వైఎస్ అభిమానులతో… ఇవాళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వైఎస్‌ షర్మిల. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె.. వైఎస్సార్ మరణవార్త విని.. అప్పట్లో తెలంగాణాలోనే  ఎక్కువమంది అభిమానులు చనిపోయారని గుర్తు చేశారు. తెలంగాణాలో ఇపుడున్న టీఆర్ఎస్ సర్కార్.. ప్రజలకు ఎంతవరకు మంచి చేస్తోందనే అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts