telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తీన్మార్ మల్లన్నకు దిమ్మతిరిగే షాక్..

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్‌ మల్లన్న…అలీయాస్‌ నవీన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారారు. ఎందుకంటే.. నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓట్లు సాధించి… అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చుక్కలు చూపించారు తీన్మార్‌ మల్లన్న. చివరి వరకు పోరాడినా మల్లన్నకు ఓటమి తప్పలేదు. అయితే..తాజాగా నవీన్ పై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. సీతాఫల్ మండి మధురానగర్ కాలనీ లో లక్ష్మి కాంత్ శర్మ మారుతి జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసాడని, ఇవ్వకుంటే తప్పుడు వార్తా కథనాలు ప్రచారం చేస్తానని బెదిరించినట్లు లక్ష్మి కాంత్ శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు ఇవ్వకపోవటంతో ఈ నెల 20 న తనపై తప్పుడు కథనాలు చేసినట్లు కూడా తెలిపారు లక్ష్మి కాంత్ శర్మ. 22 వ తేదీ రాత్రి పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయటంతో తీన్మార్ మల్లన్న పై ఐపీసీ 387, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Related posts