telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పోరాడి ఓడిన హైదరాబాద్..ఫైనల్ కు ఢిల్లీ

క్వాలిఫయర్ – 2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు చేతులు ఎత్తేసింది. 17 పరుగుల తేడాతో హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కు చేరుకుంది. హైదరాబాద్ జట్టులో వార్నర్, మనీష్ పాండే, హోల్డర్ సరిగా రాణించకపోవడంతో మ్యాచ్ చేజేతులా చేజార్చుకుంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కు మొదటి నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. విలియమ్సన్ 67 పరుగులతో రాణించినా…రబడా దాటికి జట్టు కోలుకోలేదు.  క్వాలిఫయర్ – 2 టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్లు కోల్పోయి.. 189 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ లో శిఖర్ ధవన్ 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 78 పరుగులు చేసి మళ్ళీ గాడిలో పడ్డాడు. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. Srh లో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

Related posts