telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నా ఇంటిని ముంచాలని చూశారు.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

chandrababu fire on AP CS again

ఇటీవలీ వరదల్లో నా ఇంటినిముంచాలనే ఉద్దేశంతో కృష్ణా నది పరీవాహక ప్రాంతాలన్నీ ముంచేశారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితులపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నదికి ఇటీవల సంభవించిన వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ వైపరీత్యమేననివిమర్శించారు.

ప్రకాశం బ్యారేజ్ లో నీళ్లు నేరుగా తన ఇంటి వద్దకు రావాలనేది వైసీపీ నాయకుల ఆలోచన అని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. కేవలం తన ఇంటికి మాత్రం వచ్చి నోటీసు ఇచ్చారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా తన నివాసంపైన డ్రోన్ ఎగురవేశారని దుయ్యబట్టారు. ఇందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts