తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలకు పోతోందని విమర్శించారు. అధికార పార్టీ ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు.
జాతీయ కాంగ్రెస్ లో తలెత్తిన అనిశ్చిత పరిస్థితులను టీఆర్ఎస్ ఆసరాగా తీసుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారడాన్ని అనుకూలంగా మలుచుకుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పరిస్థితి నామమాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పోరాటానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
రాజశేఖరరెడ్డి కూడు పెడితే..జగన్ పొట్ట కొడుతున్నారు: కన్నా