telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పక్క రాష్ట్రాలను చూసి సీఎం నేర్చుకోవాలి: డీకే అరుణ

dk-aruna

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేత డీకే అరుణ చేపట్టిన రెండురోజుల మహిళా సంకల్ప దీక్ష ముగిసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. దశల వారీగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.

భర్తలు తాగొచ్చి భార్యలను కొట్టినా.. చంపినా, దిశ లాంటి ఘటనలు ఎన్ని జరిగినా మద్య నిషేధం అమలు చేయకుంటే ‘ఆడపిల్లల పాపం తగులుతుంది ముఖ్యమంత్రికి’ అని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఏ విధంగా అమలు చేయాలన్నది పక్క రాష్ట్రాలను చూసి సీఎం నేర్చుకోవాలని హితవుపలికారు.

Related posts