ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ తన రూ.97 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లో సవరణలు చేసింది. జూలై మాసంలో ఈ ప్లాన్ను లాంచ్ చేసినప్పుడు 2జీబీ డేటా, 350 నిమిషాల టాక్ టైం లభించేది. ఇప్పుడు ఈ డేటాను 500 ఎంబీకి తగ్గించి, వాయిస్ కాల్స్ను అపరిమితం చేసింది.
అయితే, కాలపరిమితి 14 రోజులను మాత్రం మార్చలేదు. అన్లిమిటెడ్ ప్యాక్స్ కేటగిరీలో దీనిని చేర్చింది.తాజా సవరణతో ఇది జియో రూ.98 ప్లాన్కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. జియో రూ.98 ప్లాన్లో 2జీబీ డేటా, 300 ఎస్సెమ్మెస్లు, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్ ప్రయోజనాలు 28 రోజుల పాటు లభిస్తాయి.