కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం రేపు జరగనుందిఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించిన చర్చ జరగనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకున్న తర్వాత నెలకొన్న ప్రతిష్ఠంభనకు రేపటితో తెరపడబోతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
గత సంవత్సరం నిరహించిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. సీనియర్ నేతలు నచ్చజెప్పినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సోనియా గాంధీ ఆ బాధ్యతలు చేపట్టారు.
అయితే 73 ఏళ్ల సోనియా వయోభారం కారణంగా ఆ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను తిరిగి రాహుల్కే అప్పగించాలన్న డిమాండ్ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో ఈ విషయమై ఏదో ఒకటి తేల్చేయాలని సోనియా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు