telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతన్న కళ్లలో మురిపెం కనపడుతోంది: కేటీఆర్

ktr telangana

తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ సీజన్‌లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని పత్రికల్లో వచ్చిన వార్తలను కేటీఆర్ పోస్ట్ చేశారు.

సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదికలో వచ్చిన వివరాలు అందులో ఉన్నాయి. ఈ సీజన్‌లో 126.179 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపినట్లు అందులో పేర్కొన్నారు.

‘ఒకనాడు సాగునీరు లేక నెర్రెలు బారిన ఈ నేల నేడు రైతుబంధు కేసీఆర్ గారి నేతృత్వంలో నదీ జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తోంది. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే, రైతన్న కళ్లలో మురిపెం కనపడుతోందని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Related posts