telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రక్షణ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది : మర్రి శశిధర్ రెడ్డి

ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే హైద్రాబాద్ లో ఇలాంటి ఉపద్రవం ఏర్పడింది అని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తక్షణం రక్షణ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది అని అన్నారు. రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టాలి… మనకు సముద్రం లేకున్నా విపత్తులు వస్తాయి..ముందస్తు చర్యలు తప్పకుండా ఉండాలి అని అన్నారు. నాలలలో పూడిక కూడా తీయకుండా వ్యర్థాలను తొలగిచకుండా వరదలు ఎలా ఆపగలుగుతాము అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి అత్యధిక ఆదాయం ఉన్న..సౌకర్యాలు మాత్రం ఏమి లేవు అని తెలిపారు. 65 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు. అయితే సుందరికరణ కాదు, మౌలిక సదుపాయాలు చాలా అవసరం అని అన్నారు. 6 ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది. ? గత ప్రభుత్వాలు ఏమి చేయలేదంటున్నారు. ఇది అబద్ధం. టీఆర్ఎస్, బీజేపీ లు వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నాయని ఆదరబాధర చేస్తున్నాయి. కానీ ఇవి ప్రజలకు మేలు జరిగేవి కావు అని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

Related posts