దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. ఓట్ల లెక్కింపు వేగవంతంగా కొనసాగుతుంది. బీజేపీ ఆధిక్యం రౌండ్ రౌండ్ కు పెరుగుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఎన్డీఏ 105, యూపీఏ 29, ఇతరులు 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఇక ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆధిక్యంలో ఉండగా, అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆధిక్యంలో ఉన్నారు. మధురలో హేమమాలిని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లక్నోలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందంజలో ఉన్నారు.