telugu navyamedia
వార్తలు సామాజిక

ముంబై జైలులో 103 మందికి కరోనా..బాధితుల్లో జైలు సిబ్బంది

Mubai jail corona

ముంబైలోని ఆర్థర్‌ రోడ్డు జైలులో 103 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు కాగా, మిగతా వారు జైలు సిబ్బంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే ఈ ఉదయం బాధితులందరినీ ముంబైలోని సెయింట్ జార్జ్, గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు.

డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. అతడికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, అతడి నుంచి మిగతా వారికి అది సంక్రమించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.800 మంది మాత్రమే ఉండాల్సిన ఆర్థర్ రోడ్డు జైలులో ప్రస్తుతం 2600 మంది ఖైదీలు ఉండడంతో కిక్కిరిసిపోయింది. దీంతో కొత్త ఖైదీలను తీసుకునేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.

Related posts