తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29న కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్లనున్నారు. బుధవారం ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఆ రాత్రికి కేసీఆర్ విజయవాడలోనే బస చేస్తారు. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
కాగా వైఎస్ జగన్ శనివారం సీఎం కేసీఆర్ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఈ సందర్భంగా జగన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.