telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జాతిరత్నాలు సినిమా నుండి కొత్త పోస్టర్…

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో డెటెక్టివ్‌గా కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు హీరో నవీన్ పోలిసెట్టి. ప్రస్తుతం అనుదీప్ కేవీ దర్శకత్వంలో జాతిరత్నాలు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మాహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విడుదల కూడా కరోనా కారణంగా నిలిచింది. ఇంకా ఈ సినిమా విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ఇటీవల విడుదల చేస్తున్నారు. రేపు నవీన్ పోలిసెట్టి బర్త్‌డే స్పెషల్‌గా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఖైదీ నెం.879 డ్రస్‌తో నవీన్ కనిపిస్తున్నాడు. అంతేకాకుండా జైలులో కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తూ నవీన్ ఉన్నాడు. దానికి తోడుగా ‘రిలీజ్ ఎప్పుడు రా అయ్యా’ అని రాసి ఉండటం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం ఈ జాతిరత్నం తన సినిమా విడుదల ఎప్పుడు అవుతుందని ఎదరుచూస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా చిత్ర బృందం తమపై తామే సెటైర్ వేసుకుంటున్నట్లు ఉన్న ఈ పోస్టర్ విశేషణంగా ఆకట్టుకుంటుంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది.

Related posts