చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అనారోగ్యానికి గురై లండన్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఇప్పటికే పలువురు రాజకీయనేతలు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.
అక్బరుద్దీన్ నకు మంచి మిత్రుడని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. అక్బరుద్దీన్ వెంటనే కోలుకుని తెలంగాణ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో త్వరలో ఆయన గళం విప్పాలని కోరుకుంటున్నట్టు రేవంత్ పేర్కొన్నారు.